top of page

లోకేష్ బాబుతో యువగళం పాదయాత్రలో పాల్గొన్న బత్యాల

  • Writer: EDITOR
    EDITOR
  • Jan 27, 2023
  • 1 min read

లోకేష్ బాబుతో యువగళం పాదయాత్రలో పాల్గొన్న బత్యాల

ree
యువగళం పాదయాత్రలో పాల్గొన్న బత్యాల

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట :


తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకారం చుట్టిన 400 రోజులు 4000 కిలోమీటర్ల యువగళం పాదయాత్ర శుక్రవారం కుప్పంలోని శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి దేవాలయాన్ని దర్శించుకుని ప్రారంభించారు. ఈ పాదయాత్రలో శుక్రవారం లోకేష్ బాబుతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట నియోజకవర్గ ఇంచార్జి బత్యాల చంగల్ రాయుడు మరియు రాజంపేట ఎంపీ అభ్యర్థి గంటా నరహరి పాల్గొని స్వామివారిని దర్శించుకుని కుప్పంలోని సభ నిర్వహించిన ప్రదేశానికి పాదయాత్రగా చేరుకున్నారు.

అలాగే బత్యాల ఆదేశానుసారం నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకు భంగం కలగకుండా పూర్తి కావాలని రాజంపేట మండల పరిధిలోని అత్తిరాల గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షి త్రైతేశ్వర స్వామి వారి దేవాలయం నందు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి కోవూరు సుబ్రహ్మణ్యం నాయుడు, అనుగోలు వరకృష్ణ లు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకేష్ బాబు పాదయాత్ర కార్యక్రమానికి నియోజకవర్గం లోని అన్ని మండలాల నుండి పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page