top of page

నేడు వైఎస్సార్‌ సున్నావడ్డీ పథకం మూడో విడత పంపిణీ

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 22, 2022
  • 1 min read

ముఖ్యమంత్రి జగన్‌ నేడు ఒంగోలులో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ సున్నావడ్డీ పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న జగన్ పది గంటలకు ఒంగోలు చేరుకుని పీవీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం వైఎస్సార్‌ సున్నావడ్డీ మూడో విడత పంపిణీ రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 12 వందల 61 కోట్ల రూపాయలను డ్వాక్రా సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేసేలా బటన్‌ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page