top of page

నంగనూరు పల్లెలో వైసీపీ నుండి టిడిపిలోకి చేరికలు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Mar 24, 2024
  • 1 min read

నంగనూరు పల్లెలో వైసీపీ నుండి టిడిపిలోకి చేరికలు

ree

ree

ప్రొద్దుటూరు మార్చి 24, ప్రసన్న ఆంధ్ర


ప్రొద్దుటూరు మండల పరిధిలోని సోముల వారి పల్లె పంచాయతీ నంగనూరుపల్లె గ్రామం నందు ఆదివారం సాయంత్రం దాదాపు 60 కుటుంబాలు వైసీపీ నుండి టిడిపిలోకి చేరాయి. సితారి నాగేష్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి సమక్షంలో పార్టీ చేరికలు జరిగాయి. వైసిపిని వీడి టిడిపిలో చేరిన నాయకులకు, గ్రామస్తులకు టిడిపి అభ్యర్థి వరద టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో సితారి నాగేష్, నడిపి వెంకటసుబ్బయ్య, చిన్న వెంకటసుబ్బయ్య, సితారి సుబ్బరాయుడు, సితారి సురేంద్ర, సితారి మహేష్, ఆలమూరు రాగయ్య నాయుడు, ఆలమూరు జయరాం నాయుడు, బైరగాని నివాస్, బైరగాని హేమంత్, ఫకీరు గారి సుబ్బరాయుడు, చాపాటి పవన్, వీరన్న, సుమంత్, మోహన్, చావలి గంగన్న, పలువురు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ree

ree

ree

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page