పేదల కోసమే ఆవిర్భవించిన పార్టీ వైఎస్సార్ సిపి... చెవ్వు
- DORA SWAMY

- Mar 12, 2023
- 1 min read
పేదల కోసమే ఆవిర్భవించిన పార్టీ వైఎస్సార్ సిపి...
---చెవ్వు శ్రీనివాసులు రెడ్డి.

13 సంవత్సరాల క్రితం పేదల అభ్యున్నతికోసం వైఎస్సార్ సీపీ ని ఏర్పాటుచేసి పేదలసంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అహర్నిశలు కృషిచేస్తున్నారని మండల కన్వీనర్ చెవ్వు. శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు.12 వసంతాలు పూర్గిచేసుకొని 13 వవసంతం లోకి అడుగిడుతున్న సందర్బంగా మాజీ సర్పంచ్ చౌడవరం.రఘురామిరెడ్డి ఎస్టేట్ లోఆదివారం వైసిపి నాయకులు ఆవిర్భావదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ముందుగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసినివాళులు అర్పించారు.అనంతరం కేక్ కట్ చేసి పరస్పరం ఒకరి కొకరు తినిపించుకున్నారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చౌడవరం ఉమామహేశ్వరరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి. వెంకట రమణ, లింగం. లక్ష్మీకర్, రమణారెడ్డి, మేక.జయరామిరెడ్డి, దేవరాజు, మోచర్ల నరసింహ, గాడి ఇంతియాజ్, నాగిరెడ్డి, మంద.నాగేశ్వర, సర్పంచులు ఈశ్వరయ్యలు, పద్మాకర్, రాముడు, ఎం.కనకరాజ, హజరత్,నవీన్, పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.








Comments