top of page

అందరి సంక్షేమం ఆకాంక్షించే వ్యక్తి సీఎం జగన్. చెవ్వు శ్రీనివాసులు రెడ్డి.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Nov 16, 2023
  • 1 min read

అందరి సంక్షేమం ఆకాంక్షించే వ్యక్తి సీఎం జగన్.

వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో

మండల కన్వీనర్ శ్రీ చెవ్వు శ్రీనివాసుల రెడ్డి.

ree

రాష్ట్ర ప్రజల అందరి సంక్షేమాన్ని ఆకాంక్షించి పార్టీలకతీతంగా అర్హులందరికీ లాభాన్ని చేకూర్చిన వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి అని వైసిపి మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. గురువారం నాగవరం గ్రామం పంచాయతీ సచివాలయ పరిధిలో ఆంధ్ర రాష్ట్రానికి సీఎం జగనే ఎందుకు కావాలి అన్న కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ree

తాను మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. సంక్షేమ పథకాలను పొందడంలో గత ప్రభుత్వాలను, వైసీపీ ప్రభుత్వాన్ని బేరీజు వేసుకోవాలన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అర్హులకు నేరుగా లాభాన్ని చేకూర్చే సచివాలయ వ్యవస్థను వాలంటరీ విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అవలంబిస్తున్నాయన్నారు. ప్రతి ఇంటికి మేలు చేకూరిందని తిరిగి జగన్మోహన్ రెడ్డిని 2024 లో ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు. సచివాలయ పరిధిలో లబ్ధి చేకూరిన నిధులు జాబితాను ఏర్పాటు చేసి పార్టీ జెండాను ఎగరవేశారు. ప్రతి ఇంటికి వెళ్లి చేకూరిన సంక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ కన్వీనర్ శంకర్ రెడ్డి, స్థానిక నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page