top of page

శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి ఎందుకు అంత ప్రాధాన్యత?

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 13, 2022
  • 1 min read

శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి ఎందుకు అంత ప్రాధాన్యత?


పది రోజులు పాటు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఎందుకు కల్పిస్తారు?


ఏ రోజు దర్శనం చేసుకుంటే మంచి ఫలితాలు సిద్దిస్తాయి?


మానవులుకు 365 రోజులు, దేవతలకు ఒక్కరోజుతో సమానం


మానవులుకు 6 నెలల కాల సమయం, దేవతలకు 12 గంటల సమయం


దేవతలకు 12 గంటల రాత్రి సమయాని దక్షిణాయం అని, పగలు 12 గంటల సమయాని ఉత్తరాయణం అని అంటారు


దక్షిణాయంలో మహవిష్ణువు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు సేద తీరే సమయం, దినినే కర్కాటక మాసం అంటారు


రాత్రి 8గంటలకు మహవిష్ణువు నిద్రకు ఉపక్రమించే సమయం, 8 నుంచి 10 గంటల సమయాని సింహ మాసం అంటారు


రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య మహవిష్ణువు ప్రక్క తిరిగి పడుకునే సమయం, ఈ కాలం మానవులుకు కన్యా మాసం


అర్దరాత్రి 12గంటల నుంచి వేకువజాము 2 గంటల వరకు మహవిష్ణువు గాడ నిద్రలో వుండే సమయం, మానవులుకు తులామాసం


మహవిష్ణువు నిద్రలేచే సమయం వేకువజాము 2 గంటల 40 నిముషాలకు, ఉదయం 2 నుంచి 4 గంటల సమయాని మానవులుకు వృశ్చికమాసం


మహవిష్ణువు నాలుగు గంటల నుంచి నాలుగు గంటల నలభై నిముషాల వరకు ముక్కోటి దేవతలకు దర్శనభాగ్యం కల్పిస్తారు, ఉదయం 4 నుంచి 6 గంటల కాలాని దనుర్మాసంగా పిలుస్తారు


దేవతలకు ఒక్క గంట సమయం, మానవులుకు 15.2 రోజులుతో సమానం


దేవతలకు 40 నిముషాల సమయం, మానవులుకు 10 రోజులుతో సమానం


ఈ 10 రోజులు కాలమే, శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచే పదిరోజులు.


దినితో వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజులు వ్యవధిలో, ఏ రోజు దర్శనం చేసుకున్నా, ఉత్తమ ఫలితాలే భక్తులుకు సిద్దిస్తాయి.


ఓం నమో వెంకటేశాయ నమో నమః


ree



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page