top of page

వివేకా హత్య కేసు.. నిందితుల రిమాండ్‌ పొడిగింపు

  • Writer: EDITOR
    EDITOR
  • Jun 30, 2023
  • 1 min read

వివేకా హత్య కేసు...

నిందితుల రిమాండ్‌ పొడిగింపు...

ree

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల రిమాండ్‌ను సీబీఐ కోర్టు పొడిగించింది. ఆరుగురు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, ఉదయ్‌ కుమార్‌ రెడ్డిల రిమాండ్‌ను జులై 14 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది..


చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న నిందితులను పోలీసులు ఇవాళ సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. విచారణ సందర్భంగా కోర్టు ఆరుగురు నిందితులకు రిమాండ్‌ పొడిగించింది.


మరోవైపు ఈ కేసుకు సంబంధించి అనుబంధ ఛార్జిషీట్‌ను కోర్టులో సీబీఐ దాఖలు చేసింది. ఇప్పటికే రెండు ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేయగా.. ఇది మూడోది.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page