top of page

తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి కరోనా

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 25, 2021
  • 1 min read

రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి కరోనా వచ్చింది. కొంచెం నలతగా ఉండటంతో శనివారం సాయంత్రం పరీక్ష చేయించుకోగా యాంటీజెన్ రాపిడ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. దీంతో మంత్రి వెంటనే ఐసోలేషన్ లోకి వెళ్ళారు. వైద్యులను సంప్రదించి, తగు మందులు తీసుకుంటూ, జాగ్రత్త వహిస్తున్నారు.


ఇదిలా ఉండగా ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, రాష్ట్ర రైతుల ప్రయోజనార్థమై, వారు పండించిన ధాన్యం, బియ్యం కేంద్రం కొనుగోలు చేయడం పై రాత పూర్వక హామీ కోసం గత నాలుగు, ఐదు రోజులుగా ఢిల్లీలో పడిగాపులు కాసిన నేపథ్యంలో తనకు కరోనా వచ్చిందని మంత్రి అన్నారు. ఇప్పటికైనా కేంద్రం రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.


అయితే, గత మూడు, నాలుగు రోజులుగా తనను కలిసిన వాళ్ళు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, తగు జాగ్రత్తలు వహిస్తూ

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page