top of page

దేశ సైనికులే నిజమైన హీరోలు. నరేష్ బాబు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Feb 14, 2024
  • 1 min read

ఎస్ పి ఎస్ లో పుల్వామా బాధితులకు ఘనంగా నివాళులు.

ree

దేశ సైనికులే నిజమైన హీరోలని స్థానిక శ్రీ పద్మావతి పాఠశాల డైరెక్టర్ మాదినేని నరేష్ బాబు పేర్కొన్నారు. బుధవారం పుల్వామా బాధిత సైనికులకు కొవ్వొత్తులను వెలిగించి మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. తాను మాట్లాడుతూ సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం జమ్మూ కాశ్మీర్ భూభాగంలో దాయాది దేశ ఉగ్రవాదుల బాంబు పేలుళ్ల దుచర్య 40 మంది మన దేశ సైనికుల ప్రాణాలను పొట్టన పెట్టుకుందని,ఇది నిజంగా పిరికిపందల చర్య అని అన్నారు. హింసను విడనాడి చర్చల ద్వారా దేనినైనా సాధించుకోవచ్చన్నారు. అహింస మార్గంలో నడిచి దేశ స్వాతంత్రాన్ని సంపాదించిన గాంధీజీ దీనికి నిదర్శనమని తెలిపారు. విద్యార్థి దశ నుంచే పిల్లలకు అహింసా మార్గాలను బోధించాలని, సైన్యం పట్ల మక్కువ పెంపొందించాలని పిలుపునిచ్చారు. ప్రధానోపాధ్యాయులు బాబు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page