ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ బాదుడు
- EDITOR

- Mar 29, 2023
- 1 min read
ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ బాదుడు

జాతీయ రహదారులపై ఉన్న టోల్ప్లాజాల్లో ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ ఫీజుల బాదుడు మొదలుకానుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనూ టోల్ రుసుములను సమీక్షిస్తారు..
అందులో భాగంగా ఈసారి 5 నుంచి 10 శాతం మేర పెరగనున్నట్లు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఉన్న 58 టోల్ ప్లాజాల్లో ఏప్రిల్ 1 నుంచి పెరిగిన ఫీజులు అమల్లోకి రానున్నాయి. బీవోటీ కింద గుత్తేదారుల నిర్వహణలో ఉన్న మరో అయిదు టోల్ప్లాజాల రుసుమును జులై లేదా ఆగస్టులో సవరిస్తారు.









Comments