top of page

తిరుమల శ్రీవారికి సేవ

  • Writer: MD & CEO
    MD & CEO
  • Mar 23, 2022
  • 1 min read

ఆంధ్రప్రదేశ్, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతోంది, ఏడు కొండలపై వెలసిన శ్రీ వెంకటేశ్వరున్ని దర్శించుకోటానికి దేశం నలుమూలల నుండి హిందువులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. అందరికి శ్రీవారి సేవ చేయాలి అని ఉన్నప్పటికీ కొందరికి మాత్రమే ఆ భాగ్యం కలుగుతుంది, శ్రీవారి సన్నిధానం, హుండీ లెక్కింపు, క్యూ లైన్లు, మాడవీధులలో సేవ చేయటానికి మహిళలు శ్రీవారిపై వారి భక్తిప్రపక్తులు చాటుకుంటూ 'ఓం నమో వెంకటేశాయ' అని ఆ దేవ దేవుడిని స్మరిస్తూ సేవా కార్యక్రమాలలో నిమగ్నం అయి యెనలేని అనుభూతి చెందుతారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొందరు మహిళలు ఈరోజు శ్రీవారి సేవలో భాగంగా ఆ దేవ దేవుని సన్నిధిలో నిష్కలమయిన భక్తి శ్రద్దలతో సేవా కార్యక్రమాలు చేస్తూ హిందూ ధర్మాన్ని చాటి చెబుతున్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page