రికార్డులు తిరగరాసిన శ్రీవారి హుండీ ఆదాయం
- PRASANNA ANDHRA

- Oct 24, 2022
- 1 min read

తిరుమలలో రికార్డులు తిరగరాసిన శ్రీవారి హుండీ ఆదాయం

తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా ఈ రోజు దీపావళి ఆస్ధానాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహిస్తుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం 23-10-2022 రోజున 80,565 మంది స్వామి వారి దర్శించుకున్నారు. 31,608 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించగా, రికార్డు స్థాయిలో 6.31 కోట్ల రూపాయలు భక్తులు హుండీ స్వామి వారికి కానుకలుగా సమర్పించారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోయి టిబిసి వరకూ బయట క్యూలైన్స్ లో వేచి ఉన్నారు భక్తులు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.









Comments