top of page

19 మంది తలసేమియా చిన్నారులకు రక్తమార్పిడి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 26, 2022
  • 1 min read

ఏలూరు, ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ తలసేమియా భవనంలో చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ జి.చైతన్య కిరణ్ పర్యవేక్షణలో 19 మంది తలసేమియా చిన్నారులకు రక్తమార్పిడి నిర్వహించినట్లు ఏలూరు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల రెడ్ క్రాస్ చైర్మన్ బి.వి కృష్ణారెడ్డి తెలిపారు.

ree

ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ వెల్జన్ డెనిసన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత వేలమాటి చంద్రశేఖర జనార్ధన్ వారి సహకారంతో తలసీమియా చిన్నారులకు రక్తమార్పిడి ని నిర్వహిస్తున్నామని అన్నారు. తలసేమియా చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకు 45 మందికి ఉచిత భోజనం ఏర్పాటు చేసిన దాత బి.వి నాగ చంద్రారెడ్డి కుమారుడు అశోక్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు.


ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి బి.బెన్నీ, బొమ్మ రెడ్డి పద్మజా వాణి, బి.వి.అశోక్ రెడ్డి, స్టాఫ్ నర్సులు పి.అనూష, డి.గౌతమి తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page