top of page

వైసిపి పాలనలో రాష్ట్రం దివాలా - బత్యాల

  • Writer: EDITOR
    EDITOR
  • Feb 4, 2023
  • 1 min read

వైసిపి పాలనలో రాష్ట్రం దివాలా - బత్యాల

ree
ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో టిడిపి నాయకులు

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


వైసీపీ పాలనలో ఆంధ్ర రాష్ట్రం దివాలా తీసిందని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి భత్యాల చెంగలరాయుడు పేర్కొన్నారు. శనివారం ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యస్వామి, వరసిద్ధి వినాయక స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం "రాష్ట్రానికి ఇదేమి ఖర్మ" కార్యక్రమాన్ని చేపట్టారు. ఈడిగపాలెం, బోయపాలెం ప్రాంతాలలో పర్యటించి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బత్యాల మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో టీడీపీకి అధికారం కట్టబెట్టి వైసిపి దుర్మార్గ పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు డాక్టర్ సుధాకర్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు, కౌన్సిలర్ తుపాకుల అశోక్ కుమార్, జడ శివ, మైనారిటీ నాయకులు అబూబకర్ తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page