top of page

ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసమే మార్నింగ్ వాక్

  • Writer: EDITOR
    EDITOR
  • Nov 19, 2023
  • 1 min read

ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసమే మార్నింగ్ వాక్ - టిడిపి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు

ree
ప్రజల సమస్యల గురించి తెలుసు కొంటున్న రాజు

రాజంపేట పట్టణంలో నెలకొన్న సమస్యలను నేరుగా ప్రజల వద్ద కు వెళ్లి తెలుసుకునేందుకే మార్నింగ్ వాక్ నిర్వహించినట్లు టిడిపి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు. ఆదివారం ఉదయం రాజంపేట పట్టణంలోని పలు వార్డులో ఆయన కలియ తిరుగుతూ టీ కొట్టు దుకాణాలు వద్ద ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడంతో పాటు వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆరా తీస్తూ మార్నింగ్ వాకింగ్ చేపట్టారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వైసిపి పాలనలో ప్రజలు విసిగిపోయారని, రామరాజ్యంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని జగన్మోహన్ రాజు తెలిపారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page