top of page

టిడిపి నేత అనుమానాస్పద మృతి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Nov 25, 2022
  • 1 min read

టిడిపి నేత అనుమానాస్పద మృతి

ree

బ్రాహ్మణపల్లి కు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు శవన సురేష్ నాయుడు శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇంటిలోనే గల సంపులో పడి మృతి చెందారు. అయితే మృతుడి నుదుటిపైన, పెదవుల పైన తీవ్ర గాయాలు ఉండడంతో కుటుంబ సభ్యులు హత్య జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ree

మృతుడు సురేష్ నాయుడు బ్రాహ్మణ పల్లె పరిసర ప్రాంతాలలో గట్టి పట్టు కలిగిన నాయకుడు. టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగలరాయుడుతో కలిసి పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి. ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలో ప్రజలకు అండగా ఉంటూ, కార్యకర్తలకు భరోసా కల్పించే కీలకమైన నాయకుడు. ఇటువంటి బలమైన నాయకుడు కావడం చేతనే రాజకీయ ప్రత్యర్థులు అడ్డు తొలగించి టిడిపి బలాన్ని క్షీణింప చేసే ఎత్తులో భాగంగా ఈ హత్య జరిగి ఉండవచ్చునని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖం పైన తగిలిన గాయాలను బట్టి పాత కక్షలతో అడ్డు తొలగించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా కూడా ప్రత్యర్థులు ఈ హత్యకు పూనుకొని ఉండవచ్చునని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విభిన్న కోణాలలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. కాగా శవ పరీక్ష నిమిత్తం మృత దేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page