top of page

గంగమ్మ తల్లిని దర్శించుకున్న టిడిపి నేత చమర్తి జగన్ రాజు

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 17, 2023
  • 1 min read

గంగమ్మ తల్లిని దర్శించుకున్న టిడిపి నేత చమర్తి జగన్ రాజు

చమర్తి ని సన్మానిస్తున్న గ్రామస్తులు

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


తెలుగుదేశం పార్టీ నాయకులు కొమ్మి సాంబశివ నాయుడు ఆహ్వానం మేరకు శుక్రవారం టిడిపి నేత చమర్తి జగన్మోహన్ రాజు మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి లో గల గంగమ్మ తల్లి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలియజేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ పారా సుబ్బానాయుడును మర్యాదపూర్వకంగా కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ree

అనంతరం గ్రామస్తులు శాలువాతో చమర్తి ని ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో స్థానిక నాయకులు విజయ్ కుమార్ నాయుడు, రామ్ నారాయణ, పైడి సుధాకర్, పైడి మురళి, దేవినేని రమణయ్య నాయుడు, దేవినేని మనోజ్, ముత్తినేని శాంతయ్య నాయుడు, శకినాల రమేష్ బాబు, బాలాజీ, మండల సీనియర్ నాయకులు వెంకట సుబ్బరాజు, టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు పోలి శివకుమార్, సూర్యనారాయణ రాజు, నాగేంద్ర తులసి, వెంకటేష్ యాదవ్, గురు నాయుడు, శివకుమార్ రాజు, బుడెన్ సాహెబ్, రాజేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page