top of page

ప్రజా సంక్షేమమే జగనన్న లక్ష్యం: వైఎస్ఆర్సిపి నాయకులు తంబెళ్ల వేణుగోపాల్ రెడ్డి

  • Writer: EDITOR
    EDITOR
  • Apr 10, 2023
  • 1 min read

ప్రజా సంక్షేమమే జగనన్న లక్ష్యం: వైఎస్ఆర్సిపి నాయకులు తంబెళ్ల వేణుగోపాల్ రెడ్డి


సాతు పల్లెలో అట్టహాసంగా మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం

కిట్లు అందజేస్తున్న వేణుగోపాల్ రెడ్డి

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


ప్రజా సంక్షేమమే జగనన్న లక్ష్యమని వైఎస్ఆర్సిపి నాయకులు తంబెళ్ళ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలోని సాతు పల్లెలో

'మా నమ్మకం నువ్వే జగన్' కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన స్టిక్కర్లు, కిట్లను పంపిణీ చేశారు.

ree

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ' జగనన్నే మా భవిష్యత్' అనే నినాదంతో ప్రజలతో మమేకం అవ్వడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలకు- జగన్ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించాలని ఆయన కోరారు. నవరత్నాలు పథకాలు ద్వారా అర్హులైన పేదలందరికీ అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు. ప్రజలందరూ జగన్ ను ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థించారు.

ree

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కృష్ణారావు, కౌన్సిలర్ సత్యాల మౌనిక, సత్యాల రామకృష్ణ, గృహ సారథులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ree
ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page