top of page

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

  • Writer: EDITOR
    EDITOR
  • Oct 31, 2023
  • 1 min read

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ree
మృత దేహం ఫోటో

నందలూరు మండలం నందలూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పేటగడ్డ సమీపం లో ఉన్న మద్యం దుకాణం వద్ద చెరువు నీళ్ళు వెళ్లే కాలువలో రాజంపేట మండలం కారం పల్లి గ్రామం కు చెందిన ఎ. వెంకటేష్ (వయసు 46) అనుమానాస్పద స్థితిలో మరణించి ఉన్న అతనిని చూసి స్థానికులు పోలీసు లకు సమాచారం ఇవ్వడం తో సంఘట స్థలానికి రాజంపేట రూరల్ సి ఐ పుల్లయ్య, నందలూరు ఎస్ ఐ అబ్దుల్ జహీర్, ఏ. ఎస్. ఐ. శంకర్ నాయక్ లు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం జరిగింది. వెంకటేష్ ముద్దనూరు మండలం బండల కుంట గ్రామ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు అని తెలిపారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని, పూర్తి వివరాలు దర్యాప్తు చేస్తున్నామని సి ఐ పుల్లయ్య తెలియజేశారు.

ree
సంఘటన స్థలం పోలీస్ బృందం

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page