
కనుమ పండుగ రోజున స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షిణ
- PRASANNA ANDHRA

- Jan 16, 2022
- 1 min read
చిత్తూరు జిల్లా ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి మణికంఠ :

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి కనుమ పండుగ రోజు శ్రీకాళహస్తి పట్టణంలో స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షిణ. శ్రీకాళహస్తి పట్టణంలో కనుమ పండుగ రోజు ఆనవాయితీగా చేస్తున్నా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం స్వామి అమ్మవారు కొండ చుట్టూ దేవస్థానం ఆలయ ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు కొండ చుట్టూ జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డిగారు కుమారుడు ఆకాష్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
అసలు స్వామి అమ్మవారు ఎందుకు గిరి ప్రదక్షిణ వెళ్లారు :

దక్షిణ కైలాసంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆలయ అలంకరణ మండపం వద్ద సోమ స్కంద మూర్తి అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ ఉత్సవమూర్తులను ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవారి 16 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తారు కొండ మీద ఉన్న ఋషులు ముక్కోటి దేవతలు ఆహ్వానం పలికే పలికే స్వామి అమ్మవారు గిరిప్రదక్షిణ వెళ్లారు భక్తులు అడుగడుగున కొబ్బరికాయ కొట్టి హారతి సమర్పించారు ఊరేగింపు లో ఆలయ ఈవో పెద్దిరాజు డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి శాసనసభ్యులు కుమార్తె పవిత్ర రెడ్డి ఆకాష్ రెడ్డి అధిక సంఖ్యలో ఊరేగింపు భక్తులు పాల్గొన్నారు.








Comments