top of page

అట్టహాసంగా ప్రారంభం అయిన షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్

  • Writer: EDITOR
    EDITOR
  • Oct 1, 2023
  • 1 min read

అట్టహాసంగా ప్రారంభం అయిన షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్

ree
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్ ఐ అబ్దుల్ జహీర్

ఇందులోరు మండలంలోని రైల్వే పరిసర ప్రాంతంలో ఉన్న సంఘ్ కార్యాలయం స్మాషర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షటిల్ బ్యాట్మెంటన్ టోర్నమెంట్ శనివారం ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైల్వే డాక్టర్ బిజెపి భాస్కరరావు నందలూరు ఎస్సై అబ్దుల్ జహీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల పట్ల శారీరకంగా మానసికంగా ఎంతో ఉత్సాహం కలిగిస్తాయి అని చదువుతో పాటు క్రీడలు కూడా మంచి ప్రావీణ్యం కనబడితే రాష్ట్రస్థాయి జాతీయ స్థాయిలలో మంచి భవిష్యత్తు ఉంటుందని వారు అన్నారు అనంతరం టోర్నమెంట్ ని ప్రారంభించారు.

ree
ప్రారంభిస్తున్న డాక్టర్ జయ భాస్కర్ రావు.

ఆర్గనైజింగ్ మెంటర్ మరియు ఎస్సై ఎన్ . శ్రీధర్ బాబు మాట్లాడుతూ స్మాషర్స్ షటిల్ గ్రూప్ ప్రారంభించి మూడు సంవత్సరాలు అయిందని ఇందులో మండల స్థాయిలో అనేక టోర్నమెంట్లు నిర్వహించి మండలంలో ఉన్నటువంటి పిల్లలకు సెటిల్ పట్ల అవగాహన కల్పించామని వారికి జిల్లా స్థాయి అనుభవం కోసం ఈ ఉమ్మడి జిల్లాల టోర్నమెంటును గ్రూప్ సభ్యుల అందరు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సంఘ్ అధ్యక్షులు పి. ఇ. కే.మూర్తి, కార్యదర్శి రవిప్రకాష్, లోకో ఆఫీస్ ఓ ఎస్ రవి శంకర్, డాక్టర్ హీమండర్ సింగ్, అఖిల్, లాయర్ మోహన్, సాబేర్, దర్మతేజ, సాయి తేజ, క్రీడాకారులు, క్రీడాభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page