top of page

ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి - సీనియర్ సివిల్ జడ్జి సరస్వతి

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 18, 2023
  • 1 min read

ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి - సీనియర్ సివిల్ జడ్జి సరస్వతి

ప్రజలకు సూచనలు చేస్తున్న సీనియర్ సివిల్ జడ్జి సరస్వతి

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


ప్రజలు చట్టాల పైన అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి ఎన్.సరస్వతి తెలియజేశారు. అదనపు జిల్లా జడ్జి కోర్టు నందు శనివారం ప్రత్యేక లోక్ ఆదాలత్ నిర్వహించారు. ఈ లోక అదాలత్ నందు ఆర్ వి వి ఎస్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో విడాకుల కేసును పరిష్కరించి భార్యా-భర్తల కాపురాన్ని చక్కదిద్దారు. అనంతరం మండల పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు.

ree

ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా వ్యవహరించిన సీనియర్ సివిల్ జడ్జి సరస్వతి మాట్లాడుతూ బాండు కాల వ్యవధి మూడు సంవత్సరాలని, మూడు సంవత్సరాల లోపు కోర్టు నందు ఫైల్ చేసుకుంటే న్యాయం జరుగుతుందన్నారు. మూడు సంవత్సరాల కాల వ్యవధి దాటిన తర్వాత ఆ బాండ్ చెల్లదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శ్రీనివాసులు, గిరీష్, జనార్ధన్, భరత్, మస్తాన్, షాహిద్ లు పాల్గొని వివిధ చట్టాల పైన ప్రజలకు అవగాహన కల్పించారు.

ree
ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page