top of page

బిజెపి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కి స్వాగతం పలికిన సాయి లోకేష్.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Sep 29, 2022
  • 1 min read

రాజ్యసభ సభ్యుడికి సాదర స్వాగతం పలికిన సాయి లోకేష్.

ree

రాజ్యసభ సభ్యుడు మరియు అఖిలభారత ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ను బుధవారం బీజేపీ రాజంపేట పార్లమెంటు ఇన్చార్జి మరియు రాష్ట్ర పొలిటికల్ ఫీడ్ బ్యాక్ కమిటీ సభ్యులు సాయి లోకేష్ మరియు రాజంపేట బిజెపి నాయకులు తిరుపతి విమానాశ్రయంలో కలిసి సాదరంగా ఆహ్వానించారు. ప్రజాపోరు యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన లక్ష్మణ్ ప్రజా పోరు యాత్రపై ప్రజలలో వచ్చిన స్పందన పై అభినందనలు తెలియజేశారు. బిజెపి శ్రేణులు మరింత ఉత్సాహంతో ప్రజలలోకి వెళ్లి తమ బాణీ వినిపించాలని, ప్రజల సమస్యలను గుర్తించి సమస్యల సాధనకు కృషి చేయాలని ఈ సందర్భంగా లక్ష్మణ్ రాజంపేట బిజెపి నాయకులకు సూచించినట్లు సాయి లోకేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సుబ్బరాయుడు, జిల్లా కార్యదర్శి వై.సురేష్ రాజు, మైనారిటీ నాయకులు షబ్బీర్ అహ్మద్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page