top of page

సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 17, 2022
  • 1 min read

సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..విశేష స్పందన.

ree

చింతకొమ్మదిన్నె మండలం వెలుగు ఆఫీస్, మండలం తహసీల్దార్ కార్యాలయం వెనుక వైపు సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని కమలాపురం శాసనసభ సభ్యులు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, జడ్పీటీసీ పోచంరెడ్డి నరేన్ రెడ్డి ప్రారంభించడం జరిగింది.

ree

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత వేసవి కాలంలో , తలసేమియా , డయాసిస్ , గర్భవతుల ప్రాణాలను కాపాడాలనే ఉద్యేశ్యంతో చింత కొమ్మ దిన్నే గ్రామంలోని యువకుల సహకారంతో సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించడం చాలా గొప్ప కార్యక్రమం అని , నాగ మల్లారెడ్డి చిన్న వయసులో ఎన్నో సేవా మరియు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని భవిష్యత్తులో మరెన్నో సేవ మరియు సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని వారు తెలిపారు.

ree

ప్రతి గ్రామంలో ఇలానే యువకులు ముందుకు వచ్చి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రాణాలను కాపాడాలని తెలిపారు. ఈ రక్తదాన శిబిరం లో ఎక్కువ మంది యువకులు ముందుకువచ్చి స్వచ్ఛందంగా రక్త దానం చేయడం జరిగింది.

ree

కమలాపురం శాసనసభ సభ్యులు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, జడ్పీటీసీ నరేన్ రామాంజనేయులు రెడ్డి ని సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.


ఈ కార్యక్రమంలో మండలం ఎమ్మార్వో విజయ కుమార్ , కన్వీనర్ శ్రీనివాసులు రెడ్డి, కో కన్వీనర్ కళా యాదవ్, వైస్ ఎంపీపీ వెంకట సుధాకర్ రెడ్డి, సురేంద్ర రెడ్డి , సహస్ర ఫౌండేషన్ అధ్యక్షుడు నాగ మల్లారెడ్డి,వెంకటసుబ్బారెడ్డి, మౌలాలి , ఈశ్వర్ రెడ్డి, పవన్, గంగాధర్, నాని తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page