top of page

వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రమంతట రహదారులు గుంతల మయం

  • Writer: EDITOR
    EDITOR
  • Nov 18, 2023
  • 1 min read

వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రమంతట రహదారులు గుంతల మయం - మేడా విజయ శేఖర్ రెడ్డి

ree
గుంతలను చూపుతున్న మేడ విజయ శేఖర్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పిలుపు మేరకు రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం, నందలూరు నుండి టంగుటూరు మరియు పొత్తపి ప్రధాన రహదారిని తనిఖీ చేసి నిరసన తెలిపిన రాజంపేట నియోజకవర్గ టిడిపి నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందలూరు నుండి టంగుటూరు మరియు పొత్తపి వెళ్ళు మార్గం రోడ్డును గుంతల మయంగా మారిన రోడ్డును పరిశీలించారు. ప్రస్తుత ఎమ్మెల్యే స్వంత గ్రామానికి వెళ్లడానికి సరైన రోడ్లు లేవని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామంటూ వారు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. లేబాక చెరువు పక్కన ఉన్న టంగుటూరు మరియు పొత్తపి వెళ్ళు రోడ్డు గుంతల మయంగా మారిన రోడ్డు సామాన్యులు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారని ఆయన విమర్శించారు. సొంత మండలాన్ని పట్టించుకోని ఎమ్మెల్యే నియోజకవర్గం ప్రజల గమనిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page