top of page

గుర్తు తెలియని వాహనం డీ వ్యక్తి మృతి.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Apr 20, 2022
  • 1 min read

గుర్తు తెలియని వాహనం డీ.. వ్యక్తి అక్కడికక్కడే మృతి - రెడ్డిపల్లి చెరువు కట్ట వద్ద ప్రమాదం - మృతుడు చిన్న ఓరంపాడు సురేష్ గా గుర్తింపు.

ree

అది నిత్యం రద్దీగా ఉండే కడప- తిరుపతి జాతీయ రహదారి.ఎన్ని వేగ నిరోధక సూచీలను సూచించి, ఎన్ని జాగ్రత్తలు తెలుపుతూ ఉన్నప్పటికీ కొన్ని వాహనాల వేగం మాత్రం తగ్గదు. మేము ఇంతే అన్నట్లు కొందరు వాహనదారులు ప్రవర్తిస్తుండడంతో ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.

మాటిమాటికి ప్రమాదాల గురవుతున్న ఈ రహదారిలో ఇది ముందు వరుసలో ఉందన్నది నిజం.

ree

కాగా ఈ రోజు ఉదయం సుమారు 9.15 గంటలకు రెడ్డిపల్లి చెరువు కట్ట వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం బైకును ఢీ కొనడంతో చిన్న ఓరంపాడు గ్రామం గొల్లపల్లి కి చెందిన సురేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. కాగా శివ అనే వ్యక్తి గాయపడడం జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page