top of page

పింఛన్లు తొలగింపు పై ఆర్డీవోకు వినతిపత్రం

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 26, 2022
  • 1 min read

పింఛన్లు తొలగింపు పై ఆర్డీవోకు వినతిపత్రం

ree

రాజంపేట, ఇటీవల ప్రభుత్వం చేపట్టిన పింఛన్ల తనిఖీలలో అనేకమంది వికలాంగుల పింఛన్లు తొలగించబడ్డాయని ప్రభుత్వం వాటిని తిరిగి పునరుద్ధరించాలని కోరుతూ సోమవారం ఆర్డిఓ కోదండరామిరెడ్డికి విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగినది. ఈ సందర్భంగా అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు కేవలం ప్రభుత్వం అందించే సామాజిక పింఛన్ల మీదనే ఆధారపడి జీవిస్తుంటారని, అలాంటి వారికి భరోసా కల్పించే బాధ్యత ప్రభుత్వం పై ఉందని తెలియజేశారు. తొలగించిన పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page