top of page

వైభవపేతంగా రథోత్సవం

  • Writer: EDITOR
    EDITOR
  • Feb 20, 2023
  • 1 min read

వైభవపేతంగా రథోత్సవం

రథంలో ఊరెరుగుతున్న స్వామి వారు, అమ్మవారు..

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం హత్యరాలలో శ్రీ కామాక్షి సహిత త్రేతేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రథోత్సవ కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించారు. నూతనంగా నిర్మించిన రథంపై స్వామి వారు, అమ్మవార్లను వేలాదిమంది భక్త జన సమూహం మధ్య ఊరెరిగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ అత్యంత వైభవోపేతమైన కార్యక్రమాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.

ree

గత మూడు రోజుల నుండి బ్రహ్మోత్సవాలలో కిక్కిరిసేలా భక్తజనం హాజరవుతున్నారు. అయినప్పటికీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డి.ఎస్.పి శివ భాస్కర్ రెడ్డి నేతృత్వంలో పోలీసు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో పాటు పోలీసు సిబ్బంది, ఇతర శాఖల అధికారులు సమన్వయంగా బ్రహ్మోత్సవాలను కట్టుదిట్టమైన భద్రత చర్యలతో, భక్తులకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలతో కనులవిందుగా, ఘనంగా నిర్వహిస్తున్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page