top of page

స్థాయికి మించి మాట్లాడుతున్న వైయస్ షర్మిల - ఎమ్మెల్యే రాచమల్లు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 3, 2024
  • 1 min read

స్థాయికి మించి మాట్లాడుతున్న వైయస్ షర్మిల - ఎమ్మెల్యే రాచమల్లు

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు
ree

ree

కడప జిల్లా, ప్రొద్దుటూరు


పిసిసి అధ్యక్షురాలు షర్మిల తన స్థాయికి మించి మాటలు మాట్లాడుతున్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. షర్మిలమ్మ తాను తెలంగాణ ఆడబిడ్డనని తెలంగాణకు సంబంధించిన వ్యక్తినంటూ నాడు చెప్పుకొచ్చి, క్యాలెండర్లో పేజీ మారినంత సమయంలో రాష్ట్రాన్ని, జెండాను మార్చేసిందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డిని ఓడించమని, అవినాష్ రెడ్డి వైయస్ వివేకానంద రెడ్డిని హత్య చేశాడంటూ అభ్యంతరమైన మాటలు షర్మిల మాట్లాడారని, అవినాష్ రెడ్డి నేరం చేసినట్లు న్యాయస్థానంలో రుజువైతే తాను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు.

ree

రాజశేఖర్ రెడ్డి బిడ్డగా షర్మిలమ్మ ఎంపీగా పోటీ చేయాలని వివేకానంద రెడ్డి అనుకొని ఉండొచ్చు కానీ వివేకా చివరి కోరిక మేరకే తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నట్లు షర్మిలమ్మ చెప్పడం చాలా విడ్డూరంగా ఉందంటూ ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. తాము షర్మిలమ్మను వైయస్సార్ కుమార్తెగా స్వీకరించడం లేదని, కాంగ్రెస్ పార్టీకి, చంద్రబాబుకు మేలు చేసేందుకే అన్నను ఓడించమంటావా అంటూ ఎమ్మెల్యే రాచమల్లు ప్రశ్నించారు? అన్నను దోషి చేసి కుటుంబాన్ని రోడ్డున వేయాలని షర్మిలమ్మ చూస్తుందంటూ ఎమ్మెల్యే ఆరోపించారు. ఇకమీదట ప్రతి మాటకు ప్రతి చర్య తప్పక ఉంటుందని ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి అన్నారు.

ree
ree

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page