top of page

పోలియో చుక్కలు తప్పనిసరి - చెవ్వు శ్రీనివాసులు రెడ్డి

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Feb 27, 2022
  • 1 min read

కడప జిల్లా, ఈరోజు జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమం లో భాగంగా చిట్వేలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ శ్రీనివాసులు రెడ్డి పాల్గొని చిన్న పిల్లలకు పోలియో చుక్కలను వేస్తూ.. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదు సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరికీ అంగవైకల్యాన్ని అధికమించేందుకు ప్రభుత్వం చేపడుతున్న బృహత్తర కార్యక్రమం పల్స్ పోలియో కార్యక్రమం అన్నారు. ప్రయాణ మరియు ఎలాంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. చిట్వేలు గ్రామ ఉప సర్పంచ్ ఉమామహేశ్వర రెడ్డి మరియు వైసిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ కేవలం ఈ రెండు పోలియో చుక్కలు పిల్లలకు శ్రీరామరక్ష అని; ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగించుకోవాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాగేశ్వర,రవి మరియు వైద్యులు శైలజ, శివ ప్రసాద్ గౌడ్, భార్గవి, చిన్నికృష్ణ, హెల్త్ ఆఫీసర్ విజయ్ కుమార్, వైద్య సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page