top of page

నవ రత్నాలపై జనసేనాని సంధించిన ప్రశ్నలివే

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jul 8, 2022
  • 1 min read

పవన్ 'నవ సందేహాలు'..9 పథకాలపై జనసేనాని సంధించిన ప్రశ్నలివే

ree

వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పలు సందేహాలు లేవనెత్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై 'నవ సందేహాలు' పేరుతో ఆయన ఓ ట్వీట్‌ చేశారు.ఈ ట్వీట్‌లో రైతుభరోసా, అమ్మఒడి, పెన్షన్లు, సంపూర్ణ మద్యపాన నిషేధం, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పేదలందరికీ ఇళ్లు, ఆసరా పథకాలపై తన ప్రశ్నలను పవన్‌ సంధించారు.


పవన్‌ లేవనెత్తిన సందేహాలు.


మొదటి రత్నం - రైతు భరోసా


64 లక్షల మందికి మేలు అని చెప్పి.. 50 లక్షల మందికే భరోసా ఇవ్వడం నిజం కాదా?మూడేళ్లలో 3 వేలమంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకొంటే కేవలం 700మందికే ఆర్థిక సాయాన్ని పరిమితం చేయలేదా?


రెండో రత్నం - అమ్మఒడి

అమ్మఒడి 43 లక్షల మందికి మాత్రమే ఇచ్చి.. 83 లక్షల మందికి ఇచ్చామని ఎందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు?


మూడో రత్నం - పెన్షన్ల

పెన్షనర్ల జాబితాను కుదించి 5 లక్షల మందిని తొలగించిన మాట వాస్తవం కాదా?


నాలుగో రత్నం - సంపూర్ణ మద్యపాన నిషేధం

మద్యం ఆదాయం 2018-19లో రూ.14 వేల కోట్లు.. 2021-22లో రూ.22 వేల కోట్లు.. ఇదేనా మద్యనిషేధం? ఈ ఆదాయం చూపించే రూ.8 వేల కోట్లు బాండ్లు అమ్మలేదా?


ఐదో రత్నం - జలయజ్ఞం

పోలవరం ప్రాజెక్టును 'యుద్ధ ప్రాతిపదిక'న ఎప్పుడు పూర్తి చేస్తారో చెబుతారా?


ఆరో రత్నం - ఆరోగ్యశ్రీ

ఆరోగ్యశ్రీ పథకం నుంచి ఆసుపత్రులు ఎందుకు పక్కకు తప్పుకొంటున్నాయి? సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి వైద్యం ఖర్చులు ఎందుకు చెల్లించడం లేదు?


ఏడో రత్నం - ఫీజు రీయింబర్స్ మెంట్

పీజీ విద్యార్థులకు ఫీజు చెల్లింపులు ఎందుకు నిలిపివేశారు? రీయింబర్స్ మెంట్ చేయకపోవడం వల్లే విద్యార్థులకు హాల్ టికెట్లు ఆపేస్తున్న మాట నిజం కాదా?


ఎనిమిదో రత్నం - పేదలందరికీ ఇళ్లు

చెరువుల్లో, గుట్టల్లో స్థలాలు ఇచ్చిన మాట నిజమే కదా? ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ఎందుకు నిధులు మంజూరు చేయలేదు?


తొమ్మిదో రత్నం - ఆసరా

పొదుపు సంఘాల సంఖ్యను ఏటేటా లక్షల కొద్దీ ఎందుకు తగ్గిస్తున్నారు? అభయ హస్తం నిధులు రూ.2 వేల కోట్లు ఎటుపోయాయి?

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page