top of page

వైసిపి అధికారంలోకి రావాలని తిరుమలకు పాదయాత్ర

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Dec 2, 2023
  • 1 min read

రాష్ట్రానికి సీఎంగా జగన్ ప్రొద్దుటూరుకి ఎమ్మెల్యేగా రాచమల్లు తిరిగి ఎన్నిక కావాలని ప్రొద్దుటూరు నుండి తిరుమలకు పాదయాత్ర

ree
పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే రాచమల్లు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


రానున్న 2024 ఎన్నికలలో రాష్ట్రంలో మరల వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ముఖ్యమంత్రి కావాలని, అలాగే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ముచ్చటగా మూడవసారి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించాలని ఆకాంక్షిస్తూ, పలువురు వైసీపీ అభిమానులు చేపట్టిన పాదయాత్రను ప్రొద్దుటూరు పట్టణంలోని పాత బస్టాండ్ వద్దగల శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రలో పాత బస్టాండ్ వద్ద గల చిరు వ్యాపారులు కొండారెడ్డి, గౌడ్, మరో ఆరు మంది పాల్గొనుచున్నారు. పాదయాత్రలో భాగంగా ప్రొద్దుటూరు నుండి తిరుపతి వరకు దాదాపు 200 కిలోమీటర్ల మేర మార్గమధ్యంలోని అన్ని పల్లెలు, మండలాల, నియోజకవర్గాల మీదుగా ఈ పాదయాత్ర కొనసాగనుంది. అనంతరం తిరుమలలో స్వామి వారికి వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావాలని మొక్కులు తీర్చనున్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, రాచమల్లు అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page