top of page

ప్రొద్దుటూరు విద్యార్థులకు గండికోట వద్ద రోడ్డు ప్రమాదం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Aug 14, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ జిల్లా, జమ్మలమడుగు

కడప జిల్లా, గండికోటలో జరిగిన కార్ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వివరాల్లోకి వెళితే ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అతివేగంగా వస్తున్న కారు బైకు ను తప్పించబోయి బోల్తా పడింది. క్షతగాత్రులు అంతా విద్యార్థులే, ప్రొద్దుటూరు లోని వాగ్దేవీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గండికోట నుండి ఇంటికి వెళ్తున్న సమయంలో నిన్న ఈ ప్రమాదం జరిగింది.

ఆంజనేయ స్వామి గుడి నుండి అప్పుడే భార్య పిల్లలతో బైకుపై బయలుదేరిన వ్యకి అమాంతం రోడ్డు క్రాస్ చేయటంతో, అవతలి నుండి వస్తున్న కార్ వేగానికి అదుపు తప్పి ప్రమాదం జరిగింది. క్షతగాత్రులు నలుగురిని ప్రొద్దుటూరు లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా, మరో యువతి పరిస్థితి విషమంగా ఉండటం చేత కుర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు అందరు విద్యార్ధులే కావటం ఇక్కడ గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page