top of page

సీఎం సహాయ నిధికి 2.5లక్షల రూపాయల చెక్కు అందించిన ప్రవీణ్ రెడ్డి

  • Writer: EDITOR
    EDITOR
  • Sep 28, 2024
  • 1 min read

సీఎం సహాయ నిధికి 2.5లక్షల రూపాయల చెక్కు అందించిన ప్రవీణ్ రెడ్డి

వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి చెక్కు అందిస్తున్న జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి

అమరావతి


తాజా వరదలలో విజయవాడ బుడమేరు వాగు ఉప్పొంగి అక్కడి ప్రజలను నిరాశ్రయులను చేయడమే కాక, నివాస గృహాలు పాక్షికంగాను పరోక్షంగాను దెబ్బతిని ప్రజలు అల్లాడుతున్న వేళ, రాష్ట్ర ప్రభుత్వం వారికి చేయూతనందించి, దాతల ద్వారా సకాలంలో వారికి ఆహారం, వైద్యం అందించి ఆదుకున్న నేపథ్యంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి నాయకులు డాక్టర్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి శనివారం సాయంత్రం ఏపీ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కుటుంబ సమేతంగా కలిసి విజయవాడ వరద బాధితుల సహాయార్థం 2 లక్షల 50వేల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సీఎం సహాయ నిధికి తన వంతు సహాయంగా చెక్కును అందించిన ప్రవీణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page