top of page

మనసున్న దాతలు దయవుంచి ఆదుకోరూ..

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jun 21, 2022
  • 1 min read

మనసున్న దాతలు దయవుంచి ఆదుకోరూ..


-వైద్యానికి వెళ్తూ ప్రమాదం

-ఒకే ఇంట్లో ఇద్దరు దుర్మరణం

-మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైనం

--దాతల కోసం ఎదురు చూపు.


ree

ఈనెల 16వ తేదీన అన్నమయ్య జిల్లా చిట్వేలు మండల పరిధిలోని ఎం రాచపల్లి గ్రామానికి చెందిన పాండురాజు సుబ్బరాజు వైద్యం నిమిత్తం తన కుమారులతో కలసి హైదరాబాద్ కు వెళ్తుండగా నంద్యాల జిల్లా పాణ్యం మండలం తుమ్మరాజు పల్లె గ్రామం వద్ద డివైడర్ ను ఢీకొనడంతో తండ్రి రెండవ కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా మూడవ కుమారుడైన హరికృష్ణ రాజు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వారు ఏలూరు పెద్దాస్పత్రికి కి సూచించగా అక్కడికి చేరుకున్న బాధితులు వైద్య ఖర్చుల కోసం సుమారు ఎనిమిది లక్షలు అవుతుందని ఆసుపత్రి వారు పేర్కొన్నట్లు తెలిపారు.


కాగా కుటుంబ పెద్దను ఒక కుమారుని కోల్పోయి కడు పేద తనంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి.. ఉన్న కుమారుడిని ఎలా కాపాడుకోవాలో తెలియక మనసున్న దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.


చేతికి ఉన్న ఐదు వ్రేళ్ళను కలిపితే పిడికిలి అయినట్టు మనసున్న దాతలు అందరూ ఆలోచించి సాయమందిస్తే ఓ నిండు ప్రాణం

నిలబెట్టి ఆ కుటుంబానికి పరోక్ష ఉపకారం చేసిన వారు అవుతారని సదరు గ్రామస్తులు పేర్కొంటున్నారు.


ఎవరైనా సహాయం చేయగలిగితే బాధిత సంగం బంధువులైన వారి ఫోన్ పే నెంబర్ కు మీ సహాయాన్ని అందించవచ్చని వారన్నారు.


ఫోన్ పే నెంబర్ లు వివరాలు


డి. గిరి బాబు రాజు

9985782719

U.అజయ్ వర్మ

9553744283.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page