top of page

రాఘవేంద్ర స్వామి ని దర్శించుకున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Mar 14, 2022
  • 1 min read

ree

కర్నూలు జిల్లా, మంత్రాలయం లోని రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలుగు దేశం పార్టీ దే విజయం అని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు వారు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చారు వారికి మండల కన్వీనర్ పన్నాగ వెంకటేషప్ప స్వామి, మంత్రాలయం మండలం తెదేపా నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికినారు అనంతరం మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కరెడ్డి గారు సోదరుడు టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కి ప్రత్యేక దర్శనం చేయించారు వారికి మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి పీఠాధిపతి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదించారు అనంతరం పీఠాధిపతి శాలువా తో సన్మానించారు ప్రసాదం అందచేసి ఆశీర్వాదించారు అనంతరం మాజీ మంత్రి పితాని సత్యనారాయణ టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి గారు తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైయస్సార్ ప్రభుత్వం పరిపాలన లో విఫలం అయింది అని నవరత్నాలు కూడా అవినీతి పరంగా మారింది అని ప్రజలు వైయస్సార్ ప్రభుత్వం ని నమ్మే పరిస్థితి లేరు అని రాబోయే రోజుల్లో కచ్చితంగా తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వస్తుంది అని వైయస్సార్ ప్రభుత్వం రాష్ట్రని అప్పులు రాష్ట్రంగా మార్చింది జగన్ మోహన్ రెడ్డి అని వారు అన్నారు మంత్రాలయం నియోజకవర్గం లో కూడా కచ్చితంగా పాలకుర్తి తిక్కరెడ్డి గెలుస్తాండు అని వారు అన్నారు రాష్ట్రంలో రోడ్లు లేవు పరిశ్రమలు లేవు అసలు అభివృద్ధి అనేది ఎక్కడ చేయలేదు అని వారు అన్నారు అనంతరం నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ గారు ని పూలమాలలు తో సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పన్నాగ వెంకటేషప్ప స్వామి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి యల్లారెడ్డి, తెలుగు యువత జిల్లా నాయకులు విజయ్ రామిరెడ్డి, వగరూరు రామిరెడ్డి, చెట్నపల్లి తిక్కస్వామి, లక్ష్మయ్య,రవి,సూగురు పాండురంగ, ఐ టిడిపి బృందం భూంపల్లి నీలకంఠ, లక్ష్మారి చిదానంద,వగరూరు లింగప్ప, తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page