top of page

పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలి - విద్యార్థి సంఘాలు

  • Writer: EDITOR
    EDITOR
  • Feb 28, 2023
  • 1 min read

పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలి - విద్యార్థి సంఘాలు

ree

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


ఉద్యమ నేపథ్యం గల ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని ఎస్ ఎఫ్ ఐ మరియు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజును మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని విద్యార్థి సంఘాల నాయకులు పట్టణంలోని పలు విద్యాసంస్థలలో మంగళవారం ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు.

ree

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులు పట్ల వ్యవహరిస్తున్న తీరు దారుణమని అన్నారు. ఉద్యమ నేపథ్యం కలిగిన పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించుకుంటే ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగులకు అండగా నిలుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.మహేష్, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.శివరామకృష్ణదేవరా, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరసింహ, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు దినేష్, నియోజకవర్గ కార్యదర్శి మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page