top of page

విద్యార్థి చదువుకు భరోసా జగనన్న విద్యా దీవెన. కొరముట్ల.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 14, 2022
  • 1 min read

-జగనన్న విద్యా దీవెన నగదు పంపిణీ లో పాల్గొన్న కొరముట్ల.

-- ఆరు వేల మంది తల్లులకు 4కోట్ల 10 లక్షల నగదు బదిలీ.


ree

ఈ రోజు ఉదయం రైల్వేకోడూరు ఎంపీడీవో

కార్యాలయం నందు జరిగిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పాల్గొని

5,980 మంది తల్లుల అకౌంట్లలో సుమారు రూ. నాలుగుకోట్ల పది లక్షల ముపై రెండువేల తొమ్మిది వందల తొoబై తొమ్మిది రూపాయల (4,10,32,999)నగదు ను ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొరముట్ల మాట్లాడుతూ ఏ ఒక్కరూ ఆర్థిక ఇబ్బందులతో చదువు నిలిపివేయకూడదు అన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకం ఎందరికో ఉపయోగకరమని పేర్కొన్నారు.


ree

ఈ కార్యక్రమంలో ఎంపీపీ భవాని, జెడ్పిటిసి సుబ్బారాయుడు, వైస్ ఎంపీపీ ధ్వజ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్ రెడ్డి, ఎంపీడీవో నాగార్జున, ఉప సర్పంచ్ తోట శివ సాయి, నాయకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page