top of page

ఏపీ టిడిపి నూతన అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస రావు

  • Writer: EDITOR
    EDITOR
  • Jun 14, 2024
  • 1 min read

ఏపీ టిడిపి నూతన అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస రావు

ree

గాజువాక, ప్రసన్న ఆంధ్ర


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గాజువాక నియోజకవర్గంలో 95 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు కొనసాగగా.. చంద్రబాబు కేబినెట్లో ఆయనకు మంత్రిగా చోటు దక్కడంతో అచ్చెన్నాయుడు అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇటీవల ఆ పదవికి సరైన న్యాయం చేయగల విద్యావంతుడు అయినటువంటి పల్లా శ్రీనివాసరావు నియమించడం జరిగింది. ఈ సందర్భంగా గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ టిడిపి, జనసేన, బిజెపి శ్రేణులు కృషి పట్టుదల వాళ్లనే ఇంత భారీ మెజార్టీతో తాను నెగ్గడం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా నా తనపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగానే అధ్యక్ష పదవి ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page