top of page

చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి - జూనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి

  • Writer: EDITOR
    EDITOR
  • Jan 21, 2023
  • 1 min read

చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి - జూనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి

ree

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


చట్టాల పైన ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జూనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి తెలియజేశారు. మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో శనివారం కొత్త బోయినపల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రజలను ఉద్దేశించి సివిల్ జూనియర్ జడ్జి సంధ్యారాణి మాట్లాడుతూ చట్టాల పైన ప్రతి పౌరుడికి సరియైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. బాల్యవివాహాల నిర్మూలన, చిన్న పిల్లల సంరక్షణ తదితర అంశాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page