top of page

తారకరత్నకు ఘన నివాళులు అర్పించిన ఎన్నారై టిడిపి నాయకులు

  • Writer: EDITOR
    EDITOR
  • Feb 20, 2023
  • 1 min read

తారకరత్నకు ఘన నివాళులు అర్పించిన ఎన్నారై టిడిపి నాయకులు

నివాళి అర్పిస్తున్న ఎన్నారై టిడిపి నాయకులు

ప్రసన్న ఆంధ్ర -రాజంపేట :


గత నెల 27వ తేదీన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎన్నారై టిడిపి అధ్యక్షులు కువైట్ అక్కిలి నాగేంద్ర, ప్రధాన కార్యదర్శి మారోతు మల్లిఖార్జున అన్నారు. ఆదివారం కువైట్ లో ఓమరియా గార్డెన్ నందు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.

ree

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే యువ నాయకుడు తారకరత్న మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై కువైట్ టిడిపి నాయకులు సుబ్బరాయుడు, పిడికిట శ్రీనివాస్ చౌదరి, శంకర్ యాదవ్, బీసీ నాయకులు కొలపనేని రమేష్, ముస్తా ఖాన్, శ్రీనివాసులు, తేజ రామ్, వేణు తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page