top of page

అంతర్జాతీయ కరాటే పోటీలలో గెలుపొందిన క్రీడాకారులను అభినందించిన 74 వ వార్డు కార్పొరేటర్ తిప్పల

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Feb 21, 2022
  • 1 min read

పెదగంట్యాడ ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, పెదగంట్యాడ నెల 13వ తేదీన తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీలలో ప్రపంచవ్యాప్తంగా 3500 మంది కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం గాజువాక నుండి దయాల్ నగర్ పాత సంఘం పాక ప్రాంతం నుండి డి 10 మంది విద్యార్థులు పాల్గొనగా వారికి గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంకుల్లో రాణించారు. 74 వ వార్డు సంగం పాక దగ్గర జరిగిన కార్యక్రమంలో వీరిని కార్పొరేటర్ వంశీ రెడ్డి అభినందించారు. కరాటే సెల్ఫ్ డిఫెన్స్ కోర్సుగా నేర్చుకోవాలని ప్రత్యేకంగా అమ్మాయిలు ఈ వీధిలో రాణిస్తే ఆపత్కాలమందు దీన్ని వాడుకోవచ్చు అని అన్నారు. విద్యార్థి దశ నుండే ఈ కోర్సును నేర్చుకోవాలని ఆయన కోరారు. అనంతరం మెడల్స్ ను సర్టిఫికెట్ ను బహుకరించారు. నిర్వాహకులు కార్పొరేటర్ వంశీ రెడ్డి ని ఘనంగా సత్కరించారు. కాయ్ కరాటే జనరల్ సెక్రెటరీ ఆనంద్ బాలు, జిల్లా కార్యదర్శి కాకినాడ ఈశ్వరరావు, కోచ్ జి నారాయణమూర్తి, సీనియర్ కరాటే కోచ్ సూర్య రావు, నాని, బ్రహ్మం, బాల భాను, శ్రీనివాసరావు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page