top of page

దెయ్యం అనుకొని కూతురిని చంపేసిన తల్లి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Aug 8, 2022
  • 1 min read


ree

దెయ్యం అనుకొని కూతురిని చంపేసిన తల్లి


మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. సుభాష్‌ నగర్‌లో మూఢనమ్మకాల కారణంగా తల్లిదండ్రులు తమ ఆరేళ్ల బాలికను హత్య చేశారు. ఇద్దరినీ నాగ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాలికకు దెయ్యం పట్టిందని, ఆ దెయ్యాన్ని తరిమేందుకు దొంగ బాబా సలహా మేరకే తల్లిదండ్రులు ఈ దారుణానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. బాలిక తండ్రి చిమ్నే యూట్యూబ్‌లో స్థానికంగా న్యూస్ ఛానెల్ నడుపుతున్నాడు. గత నెల గురుపూర్ణిమ సందర్భంగా భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి తకల్‌ఘాట్‌ ప్రాంతంలోని దర్గాకు వెళ్లాడు. అప్పటి నుండి బాలిక అనారోగ్యం బారిన పడ్డది.

ree


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page