top of page

తీవ్ర తుపానుగా ‘మోచా’

  • Writer: EDITOR
    EDITOR
  • May 12, 2023
  • 1 min read

తీవ్ర తుపానుగా ‘మోచా’

రాష్ట్రంలో వడగాడ్పుల ఉధృతి

ree

విశాఖపట్నం, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను ‘మోచా’ తీవ్ర తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది గంటకు 11 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. గురు­వారం రాత్రికి పోర్టుబ్లెయిర్‌కు పశ్చిమంగా 520, మయన్మార్‌లోని సిట్వేకు దక్షిణ నైరుతి దిశగా 1020 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర దిశగా పయనిస్తూ శుక్రవా­రం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా మార­నుంది. అనంతరం మలుపు తిరిగి ఉత్తర ఈ­శాన్య దిశగా కదులుతూ అత్యంత తీవ్ర తుపా­నుగా బలపడే అవకాశం ఉందని వా­తా­వరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. కాక్స్‌ బజార్‌ (బంగ్లాదేశ్‌), క్యాక్‌ప్యూ (మయన్మార్‌) మధ్య ఈ నెల 14న మధ్యాహ్నం తీవ్ర తుపానుగా బలహీనపడి తీరాన్ని దాటవచ్చని పేర్కొంది.

ree

రాష్ట్రంలో వడగాడ్పుల ఉధృతి : రాష్ట్రంలో ఉష్ణతీవ్రత మరింత పెరుగుతోంది. శుక్రవారం నుంచి ఇది మరింత తీవ్రరూపం దాల్చి వడగాడ్పులు వీయనున్నాయి. రానున్న ఐదు రోజులు కొన్నిచోట్ల తీవ్ర వడగాడ్పులకు ఆస్కారం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐంఎండీ హెచ్చరించింది.

ree
ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page