top of page

ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ని ఘనంగా సన్మానించిన జీవీఎంసీ కౌన్సిల్

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Feb 26, 2022
  • 1 min read

ఈరోజు జీవీఎంసీ కౌన్సిల్ హాల్ లో ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ , ఎమ్మెల్సీ శ్రీమతి కళ్యాణి గౌరవ మేయర్ హరి వెంకట కుమారి , జీవీఎంసీ కమీషనర్ శ్రీ లక్ష్మీ షా, జీవీఎంసీ కౌన్సిల్ సభ్యులు ఘనంగా సన్మానించారు. మేయర్ హరి వెంకట కుమారి మాట్లాడుతూ వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రజలందరి మనన్నలతో, నిరంతరం ప్రజా సేవతో ఎమ్మెల్సీ స్థానంలో చేరుకున్నారని తెలిపారు. ఆయన మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశిస్తున్నాని అన్నారు . సామాన్యుడుగా రాజకీయ జీవితం ప్రారంభించి, ఉన్నత స్థానానికి చేరుకోవడం గర్వించదగ్గ విషయమని అన్నారు. కార్యక్రమం లో ఇటీవల యమ్.యల్.సి గా ఎన్నికైన వరుదు కళ్యాణి ని కూడ కౌన్సిల్ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమం లో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జీవీఎంసీ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page