top of page

ప్రజా సమస్యలపై వార్డు బాట లో ఎమ్మెల్సీ రమేష్

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 9, 2022
  • 1 min read

ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలోని తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన 11వ వార్డు లోని కొంపల పుల్లన్న వీధి లో పలు ప్రజా సమస్యలపై ఇంటికి తిరిగి వారి సమస్యలపై అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారం చేస్తామని రమేష్ యాదవ్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ని ఆప్యాయంగా పలకరించిన 11వ వార్డు ప్రజలు కౌన్సిలర్గా ప్రస్థానం చేసిన మీరు ఇవాళ ఎమ్మెల్సీగా ముందుకు రావడం చాలా ఆనందంగా ఉందని మీరు మరింత ఉన్నత పదవులు పొంది వార్డు మరియు నియోజక వర్గ అభివృద్ధికి పాటుపడాలని వారు కోరారు.


ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఐదవ వార్డు కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి, 11వ వార్డు వైఎస్ఆర్ సీపీ నాయకుడు దుగ్గి రెడ్డి రఘునాథ రెడ్డి, ఘంటసాల శ్రీనివాసులు, బద్వేల్ శ్రీనివాస్ రెడ్డి గారు, పవన్, కల్లూరు ప్రసాద్ రెడ్డి, నాగేంద్ర బాబు యాదవ్, నేల పాల రాముడు, సుమన్, సుబ్బారాయుడు, ఆర్ సి సుబ్బరాయుడు, పెద్ద ఎత్తున 11వ వార్డు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది.


ree

ree

ree

ree

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page