top of page

జనం మెచ్చిన నేత జగన్మోహన్ రెడ్డి - ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 20, 2022
  • 1 min read

జనం మెచ్చిన నేత జగన్మోహన్ రెడ్డి

ree

రాజంపేట, జనం మెచ్చిన నేత వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిలు పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడా, జడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతుంటారని తెలిపారు. రాష్ట్రాన్ని సంక్షేమ ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు. ఆయన 100 వసంతాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ ప్రజాసేవకు పాటుపడాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎం.జనార్దన్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు, కౌన్సిలర్లు, ప్రభుత్వ వైద్యాధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page