top of page

మెగా లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి - మూడవ అదనపు జిల్లా జడ్జి మురళీకృష్ణ

  • Writer: EDITOR
    EDITOR
  • Jan 21, 2023
  • 1 min read

మెగా లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి - మూడవ అదనపు జిల్లా జడ్జి మురళీకృష్ణ

ree
సూచనలు ఇస్తున్న మూడవ అదనపు జిల్లా జడ్జి మురళీకృష్ణ

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


ఫిబ్రవరి 11 వ తేదీన నిర్వహించే మెగా లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని జిల్లా మూడవ అదనపు జడ్జి మురళీకృష్ణ సూచించారు. శనివారం మూడవ అదనపు జిల్లా కోర్టు నందు డి.ఎస్.పి శివ భాస్కర్ రెడ్డి,సివిల్ జడ్జి సంధ్యారాణి మరియు పోలీసు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మురళీకృష్ణ మాట్లాడుతూ రాజీ మార్గమే రాచ మార్గమని అన్నారు. రానున్న మెగా లోక్ అదాలత్ లో పరిష్కరించదగిన అన్ని కేసులను కక్షిదారులతో చర్చించి పరిష్కరించే విధంగా చూడాలని ఆదేశించారు. కేసులు సత్వర పరిష్కారం అయ్యేందుకు కావలసిన సూచనలు, సలహాలు అందజేశారు. ఈ లోక్ అదాలత్ నందు వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారం అవ్వాలని., ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు.

ree


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page