top of page

కుంపినీపురం లో సొంత నిధులతో రోడ్డు మరమ్మతులు - మేడా విజయ శేఖర్ రెడ్డి

  • Writer: EDITOR
    EDITOR
  • Nov 26, 2023
  • 1 min read

కుంపినీపురం లో సొంత నిధులతో రోడ్డు మరమ్మతులు

మేడా విజయ శేఖర్ రెడ్డి.

ree
రోడ్లను మరమ్మతులు చేపిస్తున్న మేడా విజయ శేఖర్ రెడ్డి

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం కుందానెల్లూరు క్రాస్ నుండి కుంపినీపురం పంచాయతీ నూకినేనిపల్లి వరకు రాజంపేట నియోజకవర్గ టీడీపి నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి (మేడా బాబు) ఆధ్వర్యంలో వీరపురెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మరియు గణపతి సుబ్బయ్య, విఠలా స్వామి, గణపతి భాస్కర్,తదితర నాయకుల సూచన మేరకు మేడా విజయ శేఖర్ రెడ్డి తన సొంత నిధులతో రోడ్డు మరమ్మతులు నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ విజయ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ రెండు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచి తన సొంత మండలానికి రోడ్లు వేసుకోలేని దుస్థితిలో ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నారని ఆయన విమర్శించారు. నియోజకవర్గంలో అభివృద్ధి అనేది లేదని వారి సొంత పనుల కోసమే రాష్ట్ర నిధులను ఖర్చు పెట్టుకుంటున్నారే తప్ప ప్రజా ప్రయోజనాలు పక్కన పెట్టేసారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.


ఈ కార్యక్రమంలో వీరపురెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, గణపతి సుబ్బయ్య, విటలా స్వామి, గణపతి భాస్కర్,మదన్ నాయుడు, కాలి నరసింహులు, గండ్రా నరసింహ నాయడు, చిన్నయ్య చుక్క వెంకటేశ్వర్లు, చుక్క కొండయ్య, రమణయ్య, వంశీ తదితర నాయకులు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page