top of page

హత్యరాల మడుగులో వ్యక్తి మృతదేహం

  • Writer: EDITOR
    EDITOR
  • Feb 28, 2023
  • 1 min read

హత్యరాల మడుగులో వ్యక్తి మృతదేహం

మృతుడు వెంకటేశ్వర్లు ( ఫైల్ ఫోటో )

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కామాక్షి ద్తేశ్వర స్వామి కొలువై ఉన్న హత్యరాల మడుగులో మంగళవారం వ్యక్తి మృతదేహం లభించింది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు సంఘటనా స్థలం వద్ద స్కూటీ, బట్టలు, ఆధార్ కార్డు లభించడంతో వాటి ఆధారంగా మృతుడు ఎన్టీఆర్ కాలనీలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు గా గుర్తించారు. సోమవారం నుంచి అతడు కనిపించకుండా పోయినట్లు సమాచారం. మడుగు వెలుపల లభించిన ఆధారాలను బట్టి రూరల్ పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు అదృశ్యం పైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది హత్యా, ఆత్మహత్య, లేదా ప్రమాదవశాత్తు మృతి చెందాడా అన్న విషయాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page